ప్రధాని మోదీ వరల్డ్ రికార్డ్... 'ఎక్స్' లో నెంబర్ వన్

ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో ఎంత పాప్యులరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్లాట్ ఫాం ఏదైనా సరే మోదీ ఫాలోవర్ల సంఖ్య భారీగానే ఉంటుంది. తాజాగా ఆయన ఎక్స్ లో రికార్డు సృష్టించారు. 

ఎక్స్ లో మోదీ ఫాలోవర్ల సంఖ్య 10 కోట్ల మార్కును అధిగమించగా... ఎక్స్ లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన ప్రపంచ నేతగా అవతరించారు. దీనిపై ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. 

"నా ఫాలోవర్ల సంఖ్య వంద మిలియన్లు దాటిపోయింది. ఎక్స్ వంటి చురుకైన మాధ్యమంలో ఉండడం, చర్చలు, ఆలోచనలు పంచుకోవడం, ప్రజల ఆశీస్సులు, నిర్మాణాత్మక విమర్శలు... ఇలా ఎన్నో ఈ వేదిక ద్వారా పొందగలుగుతున్నందుకు సంతోషంగా ఉంది" అంటూ ట్వీట్ చేశారు. 

ఇక, భారత్ లో విపక్ష నేత రాహుల్ గాంధీ 'ఎక్స్' ఫాలోవర్ల సంఖ్య 26.4 మిలియన్లు కాగా... ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు 27.5 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే... ఇండియా కూటమిలోని నేతలందరి ఎక్స్ ఫాలోవర్లను కలిపితే 9.5 కోట్లు కాగా... ప్రధాని మోదీ ఒక్కరే 10 కోట్లతో టాప్ లో నిలవడం విశేషం.

Narendra Modi
World Record
X
Followers
India

More Telugu News